వేములవాడ, జూన్ 9: అన్ని రంగా ల్లో సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ ప్రణాళికాబద్ధంగా రాష్ట్రం పురోగతి చెందుతున్నదని, గడిచిన తొమ్మిదేండ్ల అనుభవాలతో రానున్న పదేండ్ల కాలానికి ప్రణాళికలు రూపొందించుకుందామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బో యినపల్లి వినోద్కుమార్ తెలిపారు. ద శాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వేములవాడలోని ఎస్ఆర్ఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు అధ్యక్షతన, చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలం మధురానగర్లోని వీఏఎస్ గార్డెన్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అధ్యక్షతన జరిగిన సంబురాల్లో ఆయన వినోద్ మాట్లాడా రు.
రాష్ట్రం ఆవిర్భవించిన తొమ్మిదేండ్ల కాలంలోనే అభివృద్ధి, సంక్షేమ రంగా ల్లో దేశం గర్వించే స్థాయికి చేరకున్నదని చెప్పారు. అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు 1,002 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేశామని, ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 298 గురుకులాలు మాత్రమే ఉండేవని తెలిపారు. కాళేశ్వ రం ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు సహా అనేక ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని, అదనంగా కోటి ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. వైద్య, ఆరోగ్య రంగంలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధించిందని తెలిపారు.