రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ వారి సహకారంతో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్, రాజన్న సిరిసిల్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి జూనియర్ బాల బాలికల కబడ్డీ పోటీలు శనివారం సాయంత్రం సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే IPS, నాఫ్స్కాబ్ చైర్మెన్ కొండూరు రవీందర్ రావు, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మెన్ రసమయి బాలకిషన్, చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ జగదీశ్వర్ యాదవ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు చంద్రశేఖర్, చంద్రకాంత్, సీఐ లు అనిల్ కుమార్,ఉపేందర్, వెంకటేష్,బన్సీలాల్,ఆర్.ఐ కుమార స్వామి, ఎస్సై లు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు.
సిరిసిల్ల పట్టణంలోని డా. బి ఆర్. అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వరకు ర్యాలీగా వచ్చి జ్యోతి ప్రజ్వలన చేసి రాష్ట్రస్థాయి జూనియర్ బాల బాలికల కబడ్డీ పోటీలు ప్రారంభించారు. అంతకముందు అన్ని జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ….. రాష్ట్ర మంత్రివర్యులు కె. తారకరామారావు మార్గదర్శనంలో రాష్ట్ర స్థాయి జూనియర్ బాల బాలికల కబడ్డీ పోటీలు జిల్లా పోలీస్ శాఖ వారి సహకారంతో నిర్వహించడం సంతోషకరం అని అన్నారు. కబడ్డీ క్రీడకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది అని ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా నేటి నుండి నాలుగు రోజుల పాటు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో ఫ్లడ్ లైట్ల వెలుగులో ఈ పోటీలు జరుగుతున్నాయని, రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన 68 బాలబాలికల జట్లు ఈ పోటీల్లో తలపడుతున్నాయి. క్రీడాకారులు ఆడే సమయంలో ఏకాగ్రతతో ఉండాలి,ఆటల్లో లాగే జీవితంలో కూడా గెలుపు ఓటములు ఉంటాయి జీవితంలో చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమే అని అన్నారు.