హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): నిర్వహణ నష్టాల నుంచి డిస్కంలను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.3,371 కోట్లు విడుదల చేసింది. ఈ మేర కు విద్యుత్తుశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరం లో డిస్కంలు మొత్తంగా రూ.11,143 కోట్ల నష్టాలు చవిచూశాయి. ఇందులో ఎస్పీడీసీఎల్ రూ.8,147 కోట్లు, ఎన్పీడీసీఎల్ 2,996 కోట్లు నష్టపోయాయి. ఉదయ్ స్కీంలో భాగంగా వినియోగదారులపై భారం పడకుం డా ఈ నష్టాల్లో యాభై శాతాన్ని తెలంగాణ ప్రభుత్వం భరిస్తున్నది. ఇందులో భాగంగా గతంలో రూ.2,200 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ.3,371 కోట్లు విడుదల చేసింది. దీంతో ఆ భారం విద్యుత్తు వినియోగదారులపై పడకుండా తెలంగాణ ప్రభుత్వం కాపాడినట్టయ్యింది.