హైదరాబాద్, మార్చి 3(నమస్తే తెలంగాణ): తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజినీర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా జీ అకోశ్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వీ సుధీర్కుమార్ ఎన్నికయ్యారు. రంగారెడ్డి జెడ్పీ కార్యాలయంలో ఆదివారం జరిగిన అసోసియేషన్ ఎన్నికల్లో సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా డీ గంగాధర్, ఎస్ రామకృష్ణ, సహాయ కార్యదర్శులు ఎంబీ రేణుక, ఎం బెన్ని దీపక్, కోశాధికారి బీ శ్రీమతి, టెక్నికల్ సెక్రెటరీ ఏ సుమతి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ జీ శ్రీరామ్, జోనల్ సెక్రెటరీ (జోన్6)గా పీ మంజులను ఎన్నుకున్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందచేయాలని కోరుతూ సమావేశంలో తీర్మానించినట్టు నూతన అధ్యక్షుడు అశోక్రెడ్డి తెలిపారు.