హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): టీఎస్పీజీఈసెట్లో 93.95శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి తెలిపారు. గురువారం ఆయన హైదరాబాద్లోని తన కార్యాలయంలో జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డితో కలిసి పీజీఈసెట్ ఫలితాలను విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ.. పీజీఈసెట్కు 16,563 దరఖాస్తులు రాగా, 14,882 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని, వీరిలో 13,981 (93.95) మంది అర్హత సాధించారన్నారు.
అభ్యర్థులకు ఆగస్టులో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని లింబాద్రి తెలిపారు. ఏరో స్పేస్ ఇంజినీరింగ్లో జీ దివ్య హంస 47 మారులకే టాపర్గా, ఎండీ రహీల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇం జినీరింగ్లో 44 మారులతోనే అగ్రస్థానం పొందారని వీసీ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు.