ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 31: ఓయూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి సోమవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనను ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా సన్మానించారు.
లింబాద్రి అందించిన సేవలను పలువురు కొనియాడారు. ఆయన విశ్రాంత జీవనం ప్రశాంతంగా సాగిపోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఓయూ వీసీ రవీందర్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ గణేశ్, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.