Stand With Her | హైదరాబాద్, మే 12(నమస్తే తెలంగా ణ): మహిళలపై వేధింపులు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం కూడా నేరమేనని, ఆ నిశ్శబ్దాన్ని వీడి బాసటగా నిలువడమే అసలైన పౌర బాధ్యత అని తెలంగాణ మహిళా భద్రతా విభాగం డీజీ చారు సిన్హా అభిప్రాయపడ్డారు. పురుషులను సా మాజిక పోరాటంలో భాగస్వాములను చే సేందుకు ‘స్టాండ్ విత్ హర్’ అనే వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టినట్టు వివరించా రు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కార్యక్రమంలో కేవలం చట్టాలు, పోలీసుల నిఘాతోనే భద్రత సాధ్యం కాదని, ప్రతి పురుషుడి ఆ లోచనల్లో మార్పు వచ్చినప్పుడే మహిళలకు అసలైన రక్షణ లభిస్తుందని స్పష్టం చేశారు.
ఈ డిజిటల్ క్యాంపెయిన్ నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నదని, దీనికి మద్దతుగా సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. డిజిటల్ వేదికగా సాగుతున్న ఈ కార్యక్రమంలో సినీనటుడు అడివి శేష్, విరాజిత, దీపక్ కరముంగికర్, శరత్ నల్లా, చిల్లర్ భాయ్ తదితర ప్రముఖులు భాగస్వాములుగా ఉన్నారని చారు సిన్హా తెలిపారు.