ముషీరాబాద్: ప్రముఖ రంగస్థల కళాకారుడు కాశీభట్ల కృష్ణశాస్త్రి (77) కన్నుమూశారు. జవహర్నగర్ టీఆర్టీ క్వార్టర్స్లో నివసిస్తు న్న కృష్ణశాస్త్రి ఇటీవల త్యాగరాయ గానసభకు వస్తూ రో డ్డు ప్రమాదానికి గురయ్యా రు. తలకు బలమైన గాయాలు కాగా, ముషీరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో శస్త్రచికిత్స చేశారు.
అప్పటి నుంచి ఇంటివద్దే విశ్రాంతి తీసుకుంటూ రెండ్రో జుల క్రితం స్వల్ప అనారోగ్యంతో దవాఖానలో చేర గా, గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మ రణించారు. ఆయనకు భా ర్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పలు నాటకాల్లో పాత్రలు పోషిం చారు. గానసభ పాలకమండలి సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. కృష్ణశాస్త్రి మృతి పట్ల గానసభ అధ్యక్షుడు జనార్దనమూర్తి, కళా, సాంస్కృతిక సంఘాలు సంతాపం తెలిపారు.