హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): పదోతరగతి వార్షిక పరీక్షల హాల్టికెట్లు గురువారం విడుదల కానున్నాయి. విద్యార్థుల హాల్టికెట్లను అధికారులు రేపు వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఈ నెల 18 నుంచి పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
ఎస్సెస్సీ బోర్డు అధికారులు ముద్రిత హాల్టికెట్లను జిల్లాలకు పంపించారు. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్లతో పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు సూచించిన దరిమిలా వీటిని సైతం విద్యార్థులు వినియోగించుకోవచ్చు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేయగా 5,08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.