హైదరాబాద్ : వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పరీక్ష ఫీజుల చెల్లింపునకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీ లోపు విద్యార్థులు ఫీజు చెల్లించాలని పేర్కొంది. రెగ్యులర్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన విద్యార్థులు కూడా సంబంధిత పాఠశాలల్లో ఫీజు చెల్లించొచ్చు.
రూ. 50 ఆలస్య రుసుంతో డిసెంబర్ 5 వరకు, రూ. 200 ఆలస్య రుసుంతో 15 వరకు, రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 29వ తేదీ లోపు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఇతర వివరాల కోసం హెడ్మాస్టర్లను సంప్రదించాలని సూచించారు. లేదా https://www.bse.telangana.gov.in వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.