హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫీజు చెల్లింపు షెడ్యూల్ను ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ప్రకటించారు. జులై 18వ తేదీ వరకు విద్యార్థుల నుంచి ప్రధానోపాధ్యాయులు పరీక్ష ఫీజు స్వీకరిస్తారని షెడ్యూల్లో పేర్కొన్నారు. మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు రాసే వారు రూ. 125, మూడు కంటే తక్కువ సబ్జెక్టులు రాసే వారు రూ. 110 చెల్లించాలి. ఆలస్యం రుసుం రూ. 50తో పరీక్ష ప్రారంభానికి రెండు రోజుల ముందు వరకు ఫీజు చెల్లించొచ్చు. ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు.