హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): దేశ విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే విమాన ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి విమానాశ్రయంలో ప్రతిరోజు 100 ఆఫ్లైన్ శ్రీవాణి టికెట్లను టీటీడీ జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్ల జారీకి అనుమతి లేని కారణంగా శనివారం నుంచి విమానాశ్రయానికి బదులుగా తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో జారీ చేయనున్నారు. ప్రతిరోజు 100 టికెట్లను బోర్డింగ్ పాస్ సమర్పించిన భక్తులకు యథావిధిగా శ్రీవాణి దర్శన ఆఫ్లైన్ టికెట్లను ఇవ్వనున్నట్టు టీటీడీ తెలిపింది.