హైదరాబాద్, నమస్తే తెలంగాణ/అమీర్పేట్, సెప్టెంబర్ 23: ఢిల్లీలోని ఎయిమ్స్ దవాఖాన డైరెక్టర్గా హైదరాబాద్కు చెందిన డాక్టర్ ఎం శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం సనత్నగర్లోని ఈఎస్ఐసీ దవాఖాన డీన్గా వ్యవహరిస్తున్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. ఆయన స్థానంలో శ్రీనివాస్ను నియమిం చారు. ఆయన ఆ పదవిలో ఐదేండ్లు లేదా 65 ఏండ్లు వచ్చే వరకు కొనసాగుతారు. ఈ నియామకం పట్ల సనత్నగర్ ఈఎస్ఐసీ వైద్యులు, సిబ్బంది హర్షం వ్యక్తంచేశారు.
డాక్టర్ శ్రీనివాస్ తన వైద్యవృత్తిని ఢిల్లీ ఎయిమ్స్లోనే ప్రారంభించారు. అక్కడ పీడియాట్రిక్ సర్జరీ విభాగంలో పనిచేశారు. అంచెలంచెలుగా ఎదిగి ప్రొఫెసర్ స్థాయికి చేరారు. 2016 ఫిబ్రవరిలో సనత్నగర్ ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన, వైద్య కళాశాలకు డీన్గా నియమితులయ్యారు.