భద్రాచలం: భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మూలమూర్తులకు వేదపండితులు ఏకాంతంగా తిరుకల్యాణం నిర్వహించారు. అనంతరం సీతాసమేత కల్యాణ రాముడు మిథిలా మండపానికి చేరుకున్నాడు. దీంతో శ్రీసీతారాముల కల్యాణ ఘట్టం ప్రారంభమైంది. ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ వధూవరులకు పట్టువస్త్రాలు సమర్పించారు.
సీతారాముల కల్యాణం తిలకించేందుకు రెండేండ్ల తర్వాత భక్తులకు అనుమతించారు. దీంతో భద్రాచలం, ఆలయ వీధులు భక్తజనసందోహంగా మారాయి. కరోనా నేపథ్యంలో గత రెండేండ్లు ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే.