హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): నీట్ యూజీ-2022 ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రతిభ చూపినట్టు శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన చెప్పారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను గురువారం కాలేజీలో ఆమె సన్మానించారు. ఈ సందర్భంగా సుష్మ మాట్లాడుతూ.. ఆలిండియా స్థాయిలో శ్రీచైతన్యకు చెందిన జాదవ్ వరద్ వైభవ్ (2వ ర్యాంకు),
గుళ్ల హర్షవర్ధన్ (3వ ర్యాంకు), ఎర్రబెల్లి సిద్ధార్థ్రావు(5వ ర్యాంకు), అర్పిత్ నారంగ్ (7వ ర్యాంకు), కృష్ణ ఎస్ఆర్ (8వ ర్యాంకు) ర్యాంకులు సాధించినట్టు వివరించారు. టాప్ 100లో శ్రీచైతన్యకు మొత్తం 69 ర్యాంకులు వచ్చినట్టు తెలిపారు. ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులకు ఆ విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు.