హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : విదేశీ చదువుల కోసం వేచిచూస్తున్న విద్యార్థులు స్ప్రింగ్ సీజన్ ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఐ స్కూల్ కనెక్ట్ కో ఫౌండర్ వైభవ్గుప్తా తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన స్టడీ అబ్రాడ్ ఫెస్ట్లో ఆయన మాట్లాడుతూ, ఏటా విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నదని చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం వంటి స్టెమ్ కోర్సులను విద్యార్థులు అధికంగా ఇష్టపడుతున్నట్టు పేర్కొన్నారు.