హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల న్యాయ కళాశాలల్లో ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ కోర్సు మొదటి సంవత్సరం స్పాట్ కౌన్సెలింగ్ ఈ నెల 4న నిర్వహిస్తున్నట్టు సొసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు తెలిపారు. లాసెట్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరు కావాలని, వివరాలకు www.tswreis.ac.in లేదా www.ttwrdcs.ac.in లేదా mjptbcwreis. telangana.gov.in ను సంప్రదించాలని సూచించారు.