హైదరాబాద్ : తమిళనాడులోని నాగపట్నంలో ప్రతి యేట నిర్వహించే వెల్లంకి ఫెస్టివల్ (Vellamki festival ) 2023 నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ పలు రైల్వే స్టేషన్ నుంచి వెల్లంకి వరకు ఎనిమిది ప్రత్యేక రైళ్లు (Special Trains) నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. వెల్లంకి ఫెస్టివల్ నేపథ్యలో పెరిగే ప్రయాణికుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 8 వరకు ప్రత్యేక రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయని తెలిపారు.
ఆరు రైళ్లు రద్దు, మూడు రైళ్లు పాక్షికంగా రద్దు
పలు రైల్వే స్టేషన్ల మధ్య కొనసాగుతున్న నిర్వహణ పనుల వల్ల ఎస్సీఆర్ ఆధ్వర్యంలో రైళ్లను రద్దు(Cancell) చేస్తున్నట్లు అధికారులు వివరించారు. నాందేడ్-ముంబాయి, ఆదిలాబాద్-ఛత్రపతి శివాజీ మహారాజ టెర్మినస్, జాల్నా- ఛత్రపతి శివాజీ మహారాజ టెర్మినస్ రైల్వే స్టేషన్ల మధ్య కొనసాగుతున్న నిర్వహణ పనుల వల్ల ఆరు రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ రైళ్లు ఈ నెల 13 నుంచి 15 వరకు రద్దులోఉంటాయన్నారు. సికింద్రాబాద్-మన్మడ్, నాందేడ్-బెంగుళూరు స్టేషన్ల మధ్య మూడు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.