ఆవిష్కరించిన హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ రంజిత్రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 16 : సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, గ్రీన్ ఇండియా చాలెంజ్ సమర్పణలో ఓ ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ సహ వ్యవస్థాపకుడు రాఘవ నిర్మాతగా, పూర్ణ దర్శకత్వంలో, మాట తిరుపతి రచనలో ఈ గీతం రూపుదిద్దుకుంది. బంజారాహిల్స్ ఎల్వీ ప్రసాద్ డిజిటల్ ల్యాబ్లో బుధవారం జరిగిన హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ రంజిత్రెడ్డి ఈ గీతాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బాబా ఫసియుద్దీన్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఆర్ఎస్ నాయకులు మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, రామ్మూర్తి, బీసీ కమిషన్ సభ్యులు కిశోర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.