హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : బడుల్లో ‘తొలిమెట్టు’ కార్యక్రమంపై పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. పిల్లలు సామర్థ్యాలు సాధించాలంటే.. తొలుత బోధనలో మార్పు లు రావాలని నిర్ణయించింది. అందుకు ఈ నెల 15 నుంచి బడుల్లో బోధన ఉద్యమాన్ని నిర్వహించనున్నారు. ప్రతి తరగతిలో సోపానాల క్రమంగా బోధించడం, బోధనోపకరణాలు ఉపయోగించడం, ఆటపాటలు, కృత్యాలతో బోధించి, సామర్థ్యాల సాధన చేపడుతారు.
తొలిమెట్టు అమలుపై ఇటీవలే ఉన్నతాధికారులు ఆసిఫాబాద్, నిర్మల్ తదితర జిల్లాలపై సమీక్షించారు. ఈ నెల 15 నుంచి 31 వరకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి.. తొలిమెట్టును ఓ ఉద్యమంగా నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించారు. ఈ 15రోజుల పాటు విద్యాసంబంధిత అంశాలు తప్ప మరే ఇతర కార్యక్రమాల జోలికెళ్లరాదని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, ఎస్సీఈఆర్టీ అధికారులు, కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులంతా గట్టి నిర్ణయం తీసుకొన్నారు.
15 రోజుల ప్రణాళికలు