హైదరాబాద్ : ఈ నెల 20 నుంచి ఎంసెట్ ప్రత్యేక రౌండ్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. 20, 21వ తేదీల్లో ప్రత్యేక విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. మిగిలిన 26,073 సీట్ల కోసం ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 24న ప్రత్యేక విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు.
తుది విడత వరకు ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులకు 60,214 ఇంజినీరింగ్ సీట్లను కేటాయించారు. ఇంజినీరింగ్ విభాగంలో 59,993 సీట్లు భర్తీ కాగా, 19,797 సీట్లు మిగిలాయి. ఫార్మా కోర్సుల్లో ఎంపీసీ అభ్యర్థుల కోటాకు స్పందన కరువైంది. 4,426 బీ ఫార్మసీ, ఫార్మ్ డీ సీట్లలో కేవలం 221 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.