హైదరాబాద్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించాలని, టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు విజయవంతం కావాలని కోరుతూ అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం వనపర్తి జిల్లాలోని భూలక్ష్మీ సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ ధార్మిక దృష్టితో దేశంలో ఎక్కడా లేని విధంగా 5,625 మంది అర్చక, ఉద్యోగులకు, 3,460 మంది ధూప, దీప, నైవేద్య అర్చకులకు వేతనాలు ఇస్తున్నారని, వారి మేలు ఎన్నటికీ మర్చిపోలేనిదని తెలంగాణ అర్చక సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ కొనియాడారు.