హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ప్రకృతి విపత్తుల వేళ రాష్ట్ర పౌరులను కాపాడేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) సిద్ధం అవుతున్నది. మూడు ప్రత్యేక దళాలను సంసిద్ధం చేస్తున్నారు. ఒక్కో దళంలో 50 మంది వరకు ఉంటారు. 50 మందితో ఏర్పాటైన హజార్డస్ దళం వివిధ రసాయనిక పరిశ్రమల్లో జరిగే బ్లాస్ట్లు, కెమికల్, ఇతర అగ్ని ప్రమాదాలను నివారించేందుకు పనిచేస్తుంది.
ఈ మూడు ఫోర్స్లను ప్రకృతి విపత్తుల వేళ వినియోగించుకునే విషయమై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. ప్రభుత్వ అనుమతులు రాగానే కొత్త దళాలకు నాలుగైదు నెలలు ప్రత్యేక శిక్షణ ఇచ్చి రంగంలోకి దింపుతామని రాష్ట్ర అగ్నిమాపక అడిషనల్ డీజీ నాగిరెడ్డి వెల్లడించారు.