హైదరాబాద్ : జీవనోపాధి, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని శాఖలు టీమ్ వర్క్ తో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సీఎస్ సంబంధిత శాఖాధిపతులతో జీవనోపాధి , నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలపై గురువారం బి.ఆర్.కె.ఆర్. భవన్ నందు సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలు అమలు చేస్తున్న కార్యక్రమాలను సీఎస్ ఈ సందర్భంగా సమీక్షించారు.
ఈ సమావేశంలో ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సాంకేతిక విద్య శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రఘునందన్ రావు, పరిశ్రమలశాఖ కమిషనర్ మానిక్ రాజ్, వి హబ్ సీఈఓ దీప్తి రావుల, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం డైరెక్టర్ అఖిల్ దవార్ తదితరులు పాల్గొన్నారు.