హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు మొక్కలు సరఫరా చేయాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం అరణ్యభవన్లో ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆమె సమీక్షించారు. తొలిదశలో 33 నర్సరీల్లో మొక లు పెంచాలని సూచించారు. ప్రైవేటు నర్సరీల నుంచి కొనుగోలును క్రమంగా తగ్గించాలని పేర్కొన్నారు.
ట్రీ సిటీగా వరుసగా రెండో ఏడాది కూడా హైదరాబాద్ అంతర్జాతీయ గుర్తింపు పొందటంపై అధికారులు, సిబ్బందిని ఆమె ప్రశంసించారు. సమావేశంలో పీసీసీఎఫ్, హెచ్ఓఓఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, కమిషనర్ సీడీఎంఏ డాక్టర్ ఎన్ సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ ఎం ప్రశాంతి, అదనపు పీసీసీఎఫ్ వినయ్కుమార్, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఎంజే అక్బర్ తదితరులుఉ పాల్గొన్నారు.