హైదరాబాద్ : ప్రజాకవి, శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్నకు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అవార్డు లభించడంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి హర్షం ప్రకటించారు. ‘వల్లంకి తాళం’ అనే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం గొప్ప విషయమన్నారు. సాహిత్య రంగంలో గోరటి వెంకన్న తెలంగాణ ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటారని కొనియాడిన ఆయన.. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.