హైదరాబాద్ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నీళ్ల నిరంజనుడిగా పాలమూరు ప్రజల హృదయాలను ఆయన గెలుచుకున్నారని పోచారం కొనియాడారు. పదవికి వన్నె తెచ్చే నాయకుడు నిరంజన్ రెడ్డి అని ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి, స్పీకర్ పోచారం దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు.
బంజారాహిల్స్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రి నిరంజన్ రెడ్డి జన్మదినం సందర్భంగా 87 మంది కవులు రచించిన జలాక్షరమ్ పుస్తకాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.