బీర్కూర్, నవంబర్ 27 : రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ నెల 24న కొవిడ్ పాజిటివ్ రావడంతో వైద్యుల సూచనల మేరకు ముందు జాగ్రత్తగా హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో చేరారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో డాక్టర్లు డిశ్చార్జి చేశారు. కొన్ని రోజులపాటు స్పీకర్ పోచారం హోం ఐసొలేషన్లో ఉండనున్నారు.