హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ శనివారం ప్రకటించారు. ఈ నెల 8న ప్రారంభమై 8 రోజుల పాటు కొనసాగాయి. ఈ సమావేశాల్లో రెండు తీర్మానాలు, మూడు బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.
విమర్శలు తిప్పికొట్టాం: శ్రీధర్బాబు
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ శాసనసభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు. శాసనసభ నిరవధికంగా వాయిదా పడిన అనంతరం కమిటీ హాల్లో ప్రభుత్వ విప్లు ఆదిశ్రీనివాస్, లక్ష్మణ్, బాలు నాయక్తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల హామీ మేరకు సభలో కులగణన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించామని చెప్పారు. సభలో కాంగ్రెస్ పార్టీ 8.43 గంటలు, బీఆర్ఎస్ 8.41 గంటలు, బీజేపీ 3.48 గంటలు, ఎంఐఎం 5 గంటలు, సీపీఐ 2.55 గంట సమయం కేటాయించాయని వివరించారు. శాసనమండలి ఆరు రోజుల పాటు కొనసాగిందని తెలిపారు. మండలి సమావేశాలు 11. 5 గంటల జరుగగా, 9 మంది సభ్యులు చర్చల్లో పాల్గొన్నారని చెప్పారు.