హైదరాబాద్ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సోమవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని కలిసి రాజీనామా సమర్పించారు. తన పదవికి రాజీనామా చేస్తున్నానని, ఆమోదించాలని కోరారు. ఈ మేరకు ఆయన రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఆమోదించారు. ఈ విషయాన్ని స్పీకర్ కార్యాలయం పేర్కొంది. నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన రాజగోపాల్రెడ్డి.. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.