హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టి పెట్టుకొని ఈ నెల 30 నుంచి నాందేడ్ – తిరుపతి, తిరుపతి, ఔరంగాబాద్ మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నాందేడ్ – తిరుపతి (రైలు నంబర్ 07633) మధ్య ఈ నెల 30న ప్రత్యేక రైలు నడుస్తుందని తెలిపింది. రైలు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుందని పేర్కొంది. తిరుపతి – నాందేడ్ (07634) మధ్య ఈ నెల 31న రాత్రి 9.10 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు సాయంత్రం 5.20 గంటలకు చేరుకుంటుందని తెలిపింది.
ఆయా రైలు పూర్ణ, పర్బణి, గంగఖేర్, పర్లివైద్యనాథ్, లాతూర్ రోడ్, ఉద్గిర్ భల్కి, బీదర్, జహీరాబాద్, వికారాబాద్, తాండూర్, సేరమ్, చిత్తాపూర్, సులేహల్లి, యాద్గిర్, క్రిష్ణ, రాయ్చూర్, మంత్రాలయం రోడ్, అదోని, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట స్లేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. తిరుపతి – ఔరంగాబాద్ (07637) మధ్య ప్రత్యేక రైలు ఆగస్ట్ 7, 14, 21 తేదీల్లో నడుస్తుందని చెప్పింది. రైలు ఉదయం 7 గంటలకు ఔరంగాబాద్లో బయలుదేరి మరుసటి రోజు 11 గంటలకు చేరుకుంటుందని తిరుపతి పేర్కొంది.
ఔరంగాబాద్ – తిరుపతి (07638) మధ్య ఆగస్ట్ 8, 15, 22 తేదీల్లో నడువనుండగా.. రాత్రి 11.05 గంటలకు ఔరంగాబాద్లో బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 3 గంటలకు తిరుపతి చేరుకుంటుందని చెప్పింది. ఆయా రైళ్లు రేణిగుంట, గూడూర్, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్, భల్కి, ఉద్గిరి, లాతూర్ రోడ్, పర్లి, గంగఖేర్, పర్బని, సేలు, జాల్నా స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.