South Central railway | సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ నోటిఫికేషన్పై దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)లో 9 వేల కానిస్టేబుళ్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు వస్తున్న వార్తలపై స్పష్టతను ఇచ్చింది. రైల్వేలో 9 వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అవాస్తవమని తేల్చారు. ఎలాంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే ప్రకటన ఇవ్వలేదని స్పష్టం చేసింది. రైల్వే వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ గురించి పేర్కొనలేదని తెలిపింది. అంతేకాకుండా మీడియాకు కూడా ఈ ప్రకటనపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, అది ఫేక్ వార్త అని సౌత్ సెంట్రల్ రైల్వే స్పష్టం చేసింది.