Trains Cancelled | ఆధునికీకరణ, భద్రతా పనుల కారణంగా పలు ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని దువ్వాడ రైల్వేస్టేషన్లో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, ఈ క్రమంలో ఈ నెల 30 నుంచి మే 7వ తేదీ వరకు పలు ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 29, మే 6 తేదీల్లో సికింద్రాబాద్ – విశాఖపట్నం ఎక్స్ప్రెస్, ఈ నెల 30, మే 7 తేదీల్లో విశాఖ – సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే మే 5, 6 తేదీల్లో కాచిగూడ – విశాఖపట్నం, మే 6, 7 తేదీల్లో విశాఖపట్నం – కాచిగూడ రైలును నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. 6న బిలాస్పూర్ – తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు, 6న సికింద్రాబాద్ – విశాఖ ఎక్స్ప్రెస్ రద్దు, 7న విశాఖ – సికింద్రాబాద్ దురంతో ఎక్స్ప్రెస్ను రద్దు చేస్తున్నట్లు వివరించింది. ఈ మేరకు ప్రయాణికులు సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.