కేప్టౌన్: దేశంలో అంతరించిపోతున్న చీతాల సంఖ్య మరింత పెరుగనుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే జంతువులుగా పేరొందిన చీతాలు భారత్లో అంతరించిపోయి ఐదు దశాబ్దాలకు పైగా అవుతున్నది. అయితే వాటిని దేశంలో మళ్లీ పరిరక్షించాలనే ప్రయత్నంలో భాగంగా గతేడాది సెప్టెంబర్ 17న నమీబియా నుంచి ఎనిమిది చీతాలను దేశానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అవి మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో ఉన్నాయి. తాజాగా వందకుపైగా చీతాలను అందించేందుకు దక్షిణాఫ్రికా ముందుకువచ్చింది. వచ్చే పదేండ్లలో వీటిని భారత్కు తరలించనున్నారు. ఈ మేరకు భారత్తో దక్షిణాఫ్రికా ఒప్పందం కుదురుకున్నది.
మొదటి విడుతలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 12 చీతాలను భారతకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని దక్షిణాఫ్రికా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఏటా 12 చీతాల చొప్పున రానున్న 8 నుంచి 10 ఏండ్లలో వారీగా పంపిస్తామని వెల్లడించింది.
తొలి విడతలో ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా గత సెప్టెంబర్ 17న ఎనిమిది చీతాలను నమీబియా నుంచి తెప్పించిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కులోవాటిని వదిలిపెట్టారు. ప్రస్తుతం తెచ్చే చీతాలను కూడా అదే పార్కులో విడిచిపెట్టనున్నారు. ప్రపంచంలోని మొత్తం చీతాల్లోని సగం నమీబియా, దక్షిణాఫ్రికా, బోట్స్వానా దేశాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా నమీబియాలోని అడవుల్లో చీతాలు నివసిస్తున్నాయి. కాగా, దక్షిణాఫ్రికాలో అనేక ప్రాంతాలలో చీతాలు కనిపిస్తాయి. అడవులు, ప్రైవేటు వ్యక్తులతోపాటు ప్రభుత్వ సంరక్షణలోని అటవీ ప్రాంతాల్లోనూ చీతాలు ఉన్నాయి. భారత్కు తీసుకొస్తున్న చీతాల్లో చాలావరకు ప్రభుత్వ సంరక్షణ కేంద్రాల్లో గడుపుతున్నవే కావడం విశేషం. వీటిని చాలా జాగ్రత్తగా అధికారులు చూసుకుంటున్నారు. దక్షిణాఫ్రికాలో 50కిపైగా కనిపించే నేషనల్ పార్కుల్లో మొత్తంగా 500 చీతాలు ఉన్నాయి.