హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్గా ప్రొఫెసర్ సౌమ్యా ముఖర్జీ నియమితులయ్యారు. ఇదివరకు క్యాంపస్ డైరెక్టర్గా ఉన్న జీ సుందర్ నుంచి బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. సౌమ్యా ముఖర్జీ ఐఐటీ బాంబేలో బయోమెడికల్ ఇంజినీరింగ్, బయో ఇంజినీరింగ్ విభాగాల్లో సేవలందించారు.
నార్త్ కరోలినా వర్సిటీ నుంచి పీహెచ్డీ, ఐఐటీ ఖరగ్పూర్ నుంచి బీటెక్ను పూర్తిచేశారు. ఇప్పటివరకు డైరెక్టర్గా ఉన్న జీ సుందర్ ఇకనుంచి ఆఫ్ క్యాంపస్ ప్రోగ్రామ్స్ అండ్ ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్ డైరెక్టర్గా కొనసాగుతారని బిట్స్ వర్గాలు వెల్లడించాయి.