రాష్ట్రంలో మతసామరస్యాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని దుష్టశక్తులు కుట్ర చేస్తున్నాయి. వాటి ఆటలు సాగనివ్వబోం. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు ఎంతో సంయమనంతో ఆ కుట్రను దీటుగా తిప్పికొడుతున్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో దీర్ఘకాలంపాటు టీఆర్ఎస్ ప్రభుత్వమే కొనసాగుతుంది. ఖాసిం రజ్వీ భావజాలంతో మాకు సంబంధం లేదు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎంఐఎం కట్టుబడి ఉన్నది. నిజాం ప్రభుత్వ హయాంలోనూ మత సామరస్యత పరిఢవిల్లింది. బనారస్ హిందూ యూనివర్సిటీకి ఆయన ఆర్థిక సాయం చేశారు.
– అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అధినేత, ఎంపీ