హైదరాబాద్, ఆగస్టు14 (నమస్తే తెలంగాణ): నేషనల్ ఆకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్)లో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలని రోడ్లు,భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజ్, న్యాక్ డైరెక్టర్ జనరల్ భిక్షపతిని ఆ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. ఆదివారం మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో మంత్రి సమీక్షించారు. న్యాక్ ఉద్యోగుల సమస్యలపై కూలంకషంగా చర్చించారు. ఉద్యోగులతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అలాగే న్యాక్లో అందిస్తున్న సిల్ డెవలప్మెంట్ కోర్సులపై ఆరాతీశారు.