హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ (టీపీఎస్ఏ) పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను కోరింది. టీపీఎస్ఏ అధ్యక్షుడు , ప్రధాన కార్యదర్శి ఈ శ్రీనివాస్, కోశాధికారి పండరినాథ్ శనివారం హిమాయత్నగర్లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ఆ శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్ను కలిశారు. మొత్తం 13 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ఆమెకు ఇచ్చారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నాలుగేండ్ల సర్వీసులో రెండేండ్లు ప్రొబేషన్ కాలంగా, మిగతా రెండేండ్లను రెగ్యులర్ సర్వీస్గా పరిగణనలోకి తీసుకోవాలని విన్నవించారు.