అమరావతి: తెలంగాణ చేపట్టిన తరహాలో ఏపీలోనూ జ్వర సర్వే చేపట్టారు. ఏఎన్ఎంలు ప్రతి ఇంటికీ వెళ్లి జ్వర బాధితులను గుర్తిస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా జ్వరం వచ్చినట్టయితే ఆశా కార్యకర్తలు వారికి కోవిడ్ టెస్ట్లు చేయిస్తున్నారు. పాజిటివ్ అయితే చికిత్స చేయించడం, సలహాలు ఇవ్వడం వంటివి చేస్తున్నారు. ఫీవర్ సర్వే వివరాలను వాలంటీర్లు ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు.