హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): తిరుమలలో నకిలీ ఈడీ కమిషనర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ వేదాంతం శ్రీనివాస్ భరత్ భూషణ్గా పోలీసులు గుర్తించారు.
నకిలీ ఐడీ కార్డ్స్, విజిటింగ్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్ తయారు చేసుకొని వాటి ద్వారా గరుడ సేవకు వీఐపీ బిగ్ బ్యాడ్జ్ పాస్ను, వీఐపీ ప్రోటోకాల్ దర్శనాన్ని పొందినట్టు పోలీసులు తెలిపారు.