స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 13: జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో ఇంటర్సిటీ రైలులో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయంతో రైలు దిగి పరుగులు తీశారు. ఆదివారం ఉదయం సికింద్రాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో ఆలేరు స్టేషన్ వద్ద బ్రేకులు పట్టుకుని పొగలు రావడంతో రైలును సుమారు 20 నిమిషాల పాటు నిలిపివేశారు. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.