Swarna Jayanti | స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ రైలు నుంచి పొగలు వచ్చాయి. దాంతో వెంటనే లోకో పైలెట్లు రైలును నిలిపివేశారు. మహబూబాబాద్ జిల్లా గార్ల రైల్వేస్టేషన్ సమీపంలో రాంపురం వద్ద శనివారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు వివరాలు ప్రకారం.. స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ హజ్రత్ నిజాముద్దీన్ నుంచి తిరువనంతపురం వెళ్తున్నది. రైలు గార్ల రైల్వే స్టేషన్ సమీపంలో రాంపురం గ్రామ సమీపంలో ఏసీ బోగి బీ2 నుంచి బ్యాటరీ సాంకేతిక లోపంతో ఒక్కసారిగా మంటలు, పొగలు వ్యాపించాయి. దీంతో పైలట్ అప్రమత్తమై రాంపురం గ్రామ సమీపంలో రైలును నిలిపివేశారు. దాంతో ఒక్కసారిగా ప్రయాణికులు పరుగులు పెట్టారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రమాదం జరిగింది. దాదాపు 40 నిమిషాల తర్వాత రైలును బయలుదేరింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.