నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. భారీ శబ్దాలతో ఉరుముతూ కురిసిన వర్షంతో పలుచోట్ల వరదలు పారుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. రాత్రి కురిసిన వర్షానికి త్రిపురారం మండలం మాటురు వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. వాగుపై బ్రిడ్జి నిర్మాణం జరుగుతుండటంతో వేసిన తాత్కాలిక రోడ్డుపై నుంచి వరద నీరు వెళ్తున్నది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కాగా ఈ వర్షంతో పత్తి, మిరప పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్త చేశారు.
హైదరాబాద్లో కూడా ఆకాశం మేఘావృతమై ఉన్నది. గురువారం ఉదయం నుంచే పూర్తిగా మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. వాతావరణం చల్లగా ఉండటంతో ప్రజలు బయటకు రావడానికి బద్దకిస్తున్నారు.