హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు రంగంలో మొదటిసారిగా విజయవంతంగా రాకెట్ను ప్రయోగించిన హైదరాబాద్కు స్టార్టప్ కంపెనీ మరో రాకెట్ను పంపేందుకు సన్నాహాలు చేస్తున్నది. విక్రమ్-1 పేరుతో ఆర్టిటాల్ రాకెట్ ఈ ఏడాది చివరిలోనే ప్రయోగించేందుకు పరిశోధనలు మొదలుపెట్టింది.
మూడు నెలల్లో విక్రమ్-1 ప్రయోగ సంసిద్ధతను నిర్ణయించే క్లిష్టమైన పరీక్షలు జరుగుతున్నాయని స్కైరూట్ స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు పవన్చందన ట్విట్టర్(ఎక్స్)లో పేర్కొన్నారు. ఇప్పటికే నిరుడు నవంబర్లో ఆధునిక సమాచార అధ్యయనమే లక్ష్యంగా విక్రమ్-ఎస్ రాకెట్ను స్కైరూట్ విజయవంతంగా ప్రయోగించింది. దాని తర్వాత విక్రమ్ సిరీస్లో భాగంగా విక్రమ్-1ను కక్ష్యలోకి ప్రయోగించేందుకు సన్నాహాలు ప్రారంభించినట్టు ఆయన తెలిపారు.