హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించనున్నారు. అందుకు ఐసీఐసీఐ ఫౌండేషన్ ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్ సంస్థతో కళాశాల విద్య అధికారులు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొన్నారు. బుధవారం ఐసీఐసీఐ ఫౌండేషన్ ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్ సౌత్ అండ్ ఈస్ట్ ఆపరేషన్స్ హెడ్ సాకేత్కుమార్, కళాశాల విద్య కమిషనర్ నవీన్మిట్టల్ పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకొన్నారు. హైదరాబాద్ సెంటర్ ఆఫ్ ఐసీఐసీఐ అకాడమీ ఫర్ స్కిల్స్ సెంటర్ ద్వారా ప్రస్తుతం 2వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. శిక్షణానంతరం ప్లేస్మెంట్స్ కల్పిస్తారు. కార్యక్రమంలో కళాశాల విద్య ఆర్జేడీ యాదగిరి, అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డాక్టర్ దాశరథి తిరువెంగళాచారి, ఐసీఐసీఐ సంస్థ ప్రతినిధులు బీకే వెంకటేశ్, ఎస్ గిరీశ్ తదితరులు పాల్గొన్నారు.