హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): అర్హులైన దళిత యువతకు ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో రూరల్ స్కిల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మూడు నెలల శిక్షణ అనంతరం వివిధ కంపెనీల్లో ఉద్యోగావకాలు కల్పించేందుకు చర్యలు తీసుకొంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్లోని ఫ్యాబ్ సిటీలో 35 మంది దళిత యువతకు శిక్షణ ప్రారంభించినట్టు శిక్షణ కేంద్రం అధ్యక్షుడు పొలగోని సైదులు తెలిపారు. 10+2 లేదా ఐటీఐ/డిప్లొమా పూర్తి చేసినవారికి, 5వ తరగతి వరకు చదువుకున్నవారికి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజనం, వస తి, కోర్సు మెటీరియల్, యూని ఫాం అందజేయనున్నట్టు తెలిపారు. 18 నుంచి 35 ఏండ్ల వయసువారు శిక్షణకు అర్హులు. దరఖాస్తులను ops.reads@ gmail.comకు మెయిల్ ద్వారా పంపించాలని సూచించారు. వివరాలకు 73865 40581/ 90527 67376 నంబర్లలో సంప్రదించవచ్చు.