అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి వెల్లడి
బంజారాహిల్స్, మే 12: అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అపోలో హాస్పిటల్స్ గ్రూపు, ఇంపాక్ట్ గురు ఫౌండేషన్తో కలిసి ‘ఏంజిల్- థాంక్ ఏ నర్స్’ పేరుతో కొవిడ్ వారియర్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. నర్సులకు నైపుణ్య శిక్షణ అందించటం ద్వారా వారికి మరిన్ని అవకాశాలు వచ్చేలా చూస్తామని అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి తెలిపారు. నర్సుల అంకితభావం, సేవాగుణం వెలకట్టలేనిదని, కొవిడ్ మహమ్మారి వారి ఆవశ్యకతను మరింత తెలిపిందన్నారు. ఈ కోర్సు ద్వారా దేశవ్యాప్తంగా లక్ష మంది నర్సులకు ఉచితంగా శిక్షణ అందించాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. కోర్సుకు మైక్రోసాఫ్ట్ కూడా సహకారం అందిస్తున్నదని అపోలో జాయింట్ ఎండీ సంగీతారెడ్డి పేర్కొన్నారు.