భద్రాచలం : భద్రాచలం(Bhadrachalam) సీతారామచంద్రస్వామి ఆలయంలో తిరుకల్యాణ బ్రహ్మో త్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ప్రధానఘట్టం ఆవిష్కృతం కానున్నది. శ్రీ రామనామస్మరణతో భద్రాచలం పురవీధులు మార్మోగుతున్నాయి.
కాగా, శ్రీరామ నవమి(Sri Rama Navami) సందర్భంగా రాముల వారి కల్యాణానికి మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా హాజరై స్వామి వారిని దర్శించుకొని పూజుల చేశారు. అలాగే కల్యాణం తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భద్రాద్రికి భక్తులు చేరుకున్నారు.
ప్రభుత్వం తరఫున స్వామివారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు, కూలర్లు ఏర్పాటు చేశారు.