Nagarkurnool | నాగర్కర్నూల్ : చారకొండ మండలం తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ భర్త లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వందన అనే మహిళ సిర్సనగండ్ల వీఆర్ఏగా గత కొంతకాలం నుంచి పని చేస్తోంది. వందన భర్త వెంకటయ్య ఆమె విధుల్లోనూ కల్పించుకుంటున్నాడు. స్థిరాస్తి వ్యాపార లావాదేవీలకు సంబంధించి లంచం డిమాండ్ చేశాడు వెంకటయ్య. దీంతో చేసేదేమీ లేక బాధిత వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇక శుక్రవారం చారకొండ తహసీల్దార్ కార్యాలయంలో బాధిత వ్యక్తి నుంచి వీఆర్ఏ భర్త రూ. 75 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం వీఆర్ఏ కార్యాలయంలో పాటు ఆమె నివాసంలో అధికారులు సోదాలు చేశారు.