హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల చేనేత కార్మికులకు బకాయి లను వెంటనే చెల్లించాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూ. 270 కోట్ల బతుకమ్మ చీరల బకాయిలను, చేనేత సహకార సంఘాలకు చెల్లుంచాల్సిన రూ.9 కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నేతన్నలతో రాజకీయాలు మానాలని, సిరిసిల్లలో నేత కార్మికుల దుర్భర పరిస్థితులను మానవతా దృక్పథంతో పరిషరించాలని కోరారు.